Wednesday, June 11, 2025

ఆర్‌సిబి ముందే టైటిల్ గెలిచి ఉంటే.. ఈ ఘటన జరిగేది కాదు..

- Advertisement -
- Advertisement -

ముంబై: బెంగళూరు వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers) బెంగళూరు (ఆర్‌సిబి) విజయోత్సవ వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం, పులువురు తీవ్ర గాయాలకు గురి కావడం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ విషాధ ఘటనపై పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఓ ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసం వైరల్‌గా మారింది. ఈ కాలంలో గవాస్కర్ ఘటనకు దారి దీసిన విషయాలను పూచగొచ్చినట్టు వివరించాడు. బెంగళూరు ఐపిఎల్ ఆరంభంలోనే ట్రోఫీని సాధించి ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ ప్రారంభం నుంచే బెంగళూరు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడం అనవాయితీగా మారింది. అయితే 17 ఏళ్ల గడిచినా ట్రోఫీ దక్కక పోవడంతో ఛాలెంజర్స్ అభిమానుల్లో నిరాశ, నిస్పృహాలు స్పష్టంగా కనిపించాయి.

ప్రతి సీజన్‌లో ఈ సల కప్ నమ్‌దే అంటూ బరిలోకి దిగడం వట్టి చేతులతో తిరిగి రావడంతో అభిమానుల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యే వారు. కానీ ఈ సీజన్‌లో ఆర్‌సిబి ఐపిఎల్ ట్రోఫీ సాధించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయిందన్నారు. తమ కల సాకారం కావడంతో ఆనందంతో ఊగిపోయారు. రాత్రంతా సంబరాల్లో మునిగి తేలారు. తెల్లారే ఆర్‌సిబి నిర్వాహకులు విజయోత్సవాలను ఏర్పాటు చేయడం, దీన్ని చూసేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో వారు చిన్నస్వామి స్టేడియానిక పొటెత్తారు. లక్షల సంఖ్యంలో తరలివచ్చిన అభిమానులను కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన పనిగా మారిందని, పరిస్థితి అదుపు తప్పి ఈ విషాధ ఘటన జరిగిందని గవాస్కర్ పేర్కొన్నాడు. ఆర్‌సిబి కనీసం పదేళ్ల ముందు ఐపిఎల్ గెలిచి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News