ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్స్ సాధించే ఆటగాడికి భారీ నగదు నజరానా లభించనుంది. 2025లో జరిగే వింబుల్డన్ టోర్నీ కోసం రూ.624 కోట్ల నగదు బహుమతిని అందించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ అధికారులు నిర్ణయించారు. గత సీజన్తో పోలిస్తే ఈ మొత్తం ఏడు శాతంఅధికం కావడం విశేషం. విజేతగా నిలిచే ఆటగాడికి రూ.34 కోట్ల నగదు బహుమతిని అందజేస్తారు.
2024తో పోలిస్తే ఇది 11.1 శాతం అధికం కావడం గమనార్హం. కాగా, వింబుల్డన్ టోర్నీలో పురుషులు, మహిళల విజేతలకు సమాన బహుమతి ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. ఇక తొలి రౌండ్లో నిష్క్రమించే ఆటగాళ్లకు రూ.76 లక్షల ప్రైజ్హనీ లభిస్తోంది. కాగా, గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లలో వింబుల్డన్ ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో టైటిల్ సాధించడాన్ని ఆటగాళ్లు చాలా గర్వంగా భావిస్తారు. కాగా, వింబుల్డన్ 2025 సీజన్కు ఈ నెల 30న తెరలేవనుంది.