సవాల్గా మారిన ఇంగ్లండ్తో టెస్టు సిరీస్
మన తెలంగాణ/ క్రీడా విభాగం: టెస్టుల్లో కొంత కాలంగా వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు తాజాగా ఇంగ్లండ్తో (IND vs ENG) జరిగే సిరీస్ సవాల్గా మారింది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ సిరీస్లో బరిలోకి దిగనుంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహి త్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలు లేకుండా భారత్ సిరీస్ ఆడనుంది. ఒకే సమయంలో చాలా మంది సీనియర్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా మారింది. ముఖ్యంగా రోహిత్, అశ్విన్, కోహ్లి లేని లోటు జట్టుపై బాగా నే పడే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా కోహ్లి టీమిండియాకు ప్రధాన అస్త్రంగా ఉన్నాడు. అత ను లేక పోవడం జట్టు బ్యాటింగ్ను బలహీనంగా మార్చిందనే చెప్పాలి. టెస్టుల్లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టాడు.
సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో జరిగే సిరీస్లలో కూడా విరాట్ చిరస్మరణీయ బ్యాటింగ్తో జట్టు ను ఆదుకున్నాడు. కెప్టెన్గా, బ్యాటర్గా కోహ్లి టీమిండియాపై చెరగని ముద్ర వేశాడు. చాలా కాలంగా (IND vs ENG) భారత బ్యాటింగ్ లైనప్కు వెన్నుముకగా నిలుస్తూ వస్తున్నాడు. కానీ అతను అనూహ్యంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ వంటి కీలకమైన సిరీస్లో అతని సేవలు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాయి. రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ అంతకుముందే ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచే తప్పుకున్నాడు.
ఇలా కీలకమైన ముగ్గురు ఆటగాళ్లు ఒక్కసారిగా జట్టుకు దూరం కావడంతో టీమిండియా బలహీనంగా మారిందనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత యువ కెప్టెన్ శుభ్మన్పై నెలకొం ది. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఎదుర్కొవడం అనుకున్నంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జట్టును గిల్ ఎలా నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
సవాల్ వంటిదే..
కీలకమైన ఇంగ్లండ్ సిరీస్ (IND vs ENG) కెప్టెన్ గిల్కు సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు. సీనియర్లు లేకుండా బరిలోకి దిగుతుండం ఒక కారణమైతే, కొంత కాలంగా ఎదురవుతున్న వరుస ఓటములు మరోవైపు ప్రతికూలంగా మారాయి. అందుబాటులో ఉన్న వనరులతో ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టెస్టు సిరీస్ ఆడడం అనుకున్నంత తేలికేం కాదు.
కాగా, కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్ వంటి మెరుగైన బ్యాటర్లు జట్టులో ఉండడం గిల్కు కాస్త కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అయినా ఇంగ్లండ్ను వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం ఎప్పుడూ కష్టంతో కూడుకున్న అంశంగాచే చెప్పక తప్పదు. బౌన్స్కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్లపై ఆడడం ఏ బ్యాట్స్మన్కైనా కష్టమే. ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా సిరీస్లో ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.