హెడింగ్లే: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీ (Ind vs Eng) మిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్లో భారత్కు కష్టాలు తప్పక పోవ చ్చు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్, మహ్మద్ షమి వంటి సీనియర్లు లేకుండానే భారత్ సిరీస్ బ రిలో దిగుతోంది. చాలా కాలంగా భారత క్రికెట్లో కీలకం గా ఉన్న ఆటగాళ్లు లేకుండానే సుదీర్ఘమైన టెస్టు సిరీస్లో త లపడడం జట్టుకు సవాల్గా తయారైంది.
సొంత గడ్డపై ఇంగ్లండ్కు భారత్పై కళ్లు చెదిరే రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. బౌన్స్ సహకరించే (Ind vs Eng) ఇంగ్లండ్ పిచ్లపై భారత్కు ఇ బ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జట్టులో కెఎల్ రాహుల్ ఒక్కడే అనుభవజ్ఞుడైన బ్యాటర్గా ఉన్నాడు. కరుణ్ నాయర్ జట్టులో ఉన్నా అతను చాలా కాలం తర్వా త టెస్టు క్రికెట్ బరిలో దిగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రాహుల్, కరుణ్లపైనే నిలిచింది.
వీరు ఎలా ఆడతారనే దానిపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇక సిరీస్లో అనుభవలేమి భారత్కు అతి పెద్ద సమస్యగా మారనుంది. జట్టులో ఇద్దరు ముగ్గురు తప్పిస్తే పెద్దగాఅనుభవం ఉన్న ఆటగాళ్లు పెద్దగా లేరనే చెప్పాలి. సీనియర్ల్ రోహిత్, కోహ్లి, అశ్విన్లు ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో రోహిత్, విరాట్లు ఎప్పుడూ ముందుండే వారు. వారు లేని లోటు సిరీస్లో స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి లేకుండానే ఇంగ్లండ్ వంటి క్లిష్టమైన సిరీస్ ఆడుతుండడం చాలా క్లిష్టమైన అంశంగా తయారైంది. విశ్లేషకులు సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సమష్టిగా రాణిస్తేనే..
ఈ పరిస్థితుల్లో సిరీస్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే టీమిండియా ముందు సమష్టిగా రాణించడం తప్పిం చి మరో మార్గం లేదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసికట్టుగా ముందుకు సాగాలి. కెప్టెన్ శుభ్మన్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ల పాత్ర చాలా కీలకంగా మారింది. ఇద్దరు ఒకరికొకరూ సలహాలు, సూచనలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించక తప్పదు. రాహుల్, బుమ్రా, జడేజాలు కూడా తమవంతు సహకారం అందించాలి. మరోవైపు సీనియర్ బౌలర్ బుమ్రా ఫిట్నెస్ సమస్య జట్టును వెంటాడుతోంది. జట్టుకు చాలా కీలకమైన బౌలర్గా ఉన్న బుమ్రాపై భారీ ఆశలున్నాయి. బౌలింగ్ దళాన్ని అతనే ముందుండి నడిపించాల్సి ఉంది. కానీ ఫిట్నెస్ సమస్య అతనికి ప్రతికూలంగా మారింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులు కూడా మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. అప్పుడే సిరీస్లో భారత్కు మెరుగైన అవకాశాలుంటాయి.