Saturday, June 28, 2025

నేడు భారత్-ఇంగ్లండ్ తొలి టి20

- Advertisement -
- Advertisement -

నాటింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య శనివారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. సిరీస్‌లో ఇరు జట్లు ఐదు టి20 మ్యాచుల్లో తలపడనున్నాయి. రెండు జట్లలోనూ స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. ఇంగ్లండ్ టీమ్‌కు నాట్ సివర్ బ్రంట్, టీమిండియాకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తున్నారు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. వైస్ కెప్టెన్ మంధాన ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. సమష్టిగా రాణిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్‌కు కష్టమేమీ కాదు. ఇక ఆతిథ్య ఇంగ్లండ్ టీమ్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ సివల్, సోఫియా, అమీ జోన్స్, ఎకిల్‌స్టోన్, కాప్సి, డానిల్లి వ్యాట్ తదితరులతో ఇంగ్లండ్ బలోపేతంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News