Sunday, June 29, 2025

ఇంగ్లాండ్ తో టీ20 మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన మంధాన

- Advertisement -
- Advertisement -

నాటింగ్‌హామ్‌: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో విరుచుకుపడింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం నాటింగ్‌హామ్‌ లోని ట్రెంట్ బిడ్జ్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టీ20లో టాస్ ఓడి ముందుగా భారత్ బ్యాటింగ్ చేపట్టింది. మంధాన(112) అద్భుత సెంచరీతో చెలరేగింది. టీ20లో మంధానకు ఇదే తొలి సెంచరీ. స్మృతి తోపాటు హార్లీన్ డియోల్(43), షెఫాలీ వర్మ(20)లు రాణించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్లోట్, ఎకిల్‌స్టోన్ చెరో వికెట్ తీశారు.

అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరినా.. నాట్ స్కైవర్-బ్రంట్(39 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకుంది. దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News