- Advertisement -
కొన్ని మినహాయింపులతో భారత్ అమెరికాకు తమ పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్పై పలు రకాల సుంకాల విధింపుల ఆదేశాలను అమెరికా ఈ నెల 29వ తేదీ నుంచి అమలులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే 800 డాలర్ల వరకూ విలువ చేసే సరుకులపై ఇప్పుడు ఉన్న డ్యూటీ ఫ్రీ మినిమ్స్ రద్దుకు కూడా అమెరికా నిర్ణయించింది. ఈ క్రమంలో పోస్టల్ సర్వీసెస్ను భారతదేశం నిలిపివేసింది. ఈ మేరకు భారత పోస్టల్ విభాగం శనివారం అధికారిక ప్రకటన వెలువరించింది. 100 డాలర్ల వరకూ విలువచేసే లెటర్స్, డాక్యుమెంట్లు , కానుకలు తప్పితే మిగిలినవి ఏవీ కూడా ఇక అమెరికాకు పోస్టు ద్వారా వెళ్లేందుకు వీలుండదు.
- Advertisement -