- Advertisement -
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ను దెబ్బ తీసేందుకు భారత్ వ్యూహాలు రచిస్తోంది. ఉగ్రవాదులును తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.పాకిస్థాన్లో ఎగుమతులు, దిగుమతులను నిషఏధిసున్నట్లు కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిది. ఈ నిషేధం నుంచి మినహాయింపు కావాలంటే.. భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిసన నోటిఫికేసన్లో పేర్కొంది.
- Advertisement -