- Advertisement -
దేశంలో కోవిడ్ 19 కేసులు క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇందులో కేరళ నుండి అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలపింది. మరో రెండు కోవిడ్ మరణాలు సంభవించాయి. వీటితో ఈ సంవత్సరం మొత్తం మరణాల సంఖ్య 7కి చేరుకుంది. ఇక, దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4,302గా ఉందని తెలిపింది. కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా..
ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య సూచించింది.
- Advertisement -