హోవ్: ఇంగ్లండ్ అండర్19 టీమ్తో జరిగిన యూత్ వన్డేలో భారత యువ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను భారత యువ బౌలర్లు 174 పరుగులకే పరిమితం చేశారు. ఓపెనర్ ఇసాక్ మహ్మద్ (42), రాకి ఫ్లింటాప్ (56) మాత్రమే కాస్త మెరుగైన బ్యాటింగ్ను కనబరిచారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
భారత బౌలర్లలో హెనిల్ పటేల్, అంబరీష్, మహ్మద్ ఎనాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. అసాధారణ బౌలింగ్ను కనబరిచిన కనిష్క్ చౌహాన్ 10 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీశాడు. తర్వాత బ్యాటింగ్కు ఇండియా అండర్ 19 టీమ్ 24 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, 3 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. కెప్టెన్ అయుష్ మాత్రే (21) పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు (45), రాహుల్ కుమార్ (17) పరుగులతో నాటౌట్గా నిలిచారు. విహాన్ మల్హోత్ర (18), మౌల్యరాజ్ సిన్హ్ చడ్వా (16) పరుగులు సాధించారు.