వాషింగ్టన్డిసి:భారతదేశంతో వాణిజ్య ఒ ప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా చా లా చేరువలో ఉందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు.భారతదేశం, పాకిస్తాన్ మ ధ్య బులెట్ల ద్వారా కాకుండా వాణిజ్యం ద్వారా అణుయుద్ధ ప్రమాదాన్ని నివారించగలగినందుకు తాను గర్విస్తున్నానని ట్రంప్ అన్నారు. యుద్ధం ఆపి వేయకపోతే రెండు దేశాలతో వాణిజ్యాన్ని నిలిపి వేస్తామని భా రత్ – పాక్ లను నిలిపివేస్తామని తాను హె చ్చరించినట్లు ట్రంప్ కొద్ది వారాలుగా పదేపదే చెబుతున్నారు.పాకిస్తాన్తో సైనిక ఘర్షణ సమయంలో భారత, అమెరికా నా యకుల మధ్య జరిగిన చర్చల్లో వాణిజ్యం అంశం అసలు ప్రస్తావనకే రాలేదని భారత దేశం పేర్కొంది. వాణిజ్య ప్రతిపాదన వల్లనే ఘర్షణ నిలిచిందన్న ట్రంప్ సర్కార్ చేసి న వాదనను భారతదేశం తిరస్కరించింది. అ టు భారతదేశంతోనూ, ఇటు పాకిస్తాన్ తో నూ సామరస్య పూర్వకంగా వ్యవహరించి అణుయుద్ధం నిలిపివేయగలిగినందుకు తా ను గర్విస్తున్నానని ట్రంప్ తెలిపారు.
త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం
- Advertisement -
- Advertisement -
- Advertisement -