Thursday, June 26, 2025

చిత్తుగా ఓడిన శ్రీలంక.. ముక్కోణపు వన్డే సిరీస్ భారత్ కైవసం

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ సిరీస్ ను నిర్వహించారు. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 343 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 4, అమన్‌జ్యోత్‌ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రీచరణి ఒక వికెట్‌ తీసింది. దీంతో టీమిండియా 97 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసి ట్రై సిరీస్ విజేతగా నిలిచింది. సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(116) శతకంతో చెలరేగింది. హర్లీన్‌ డియోల్ (47), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జేమీమా రోడ్రిగ్స్ (44), ప్రతీకా రావల్(30)లు రాణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News