న్యూఢిల్లీ: యూరప్ టూర్ను భారత మహిళల జూనియర్ హాకీ జట్టు (Hockey team) విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన పోరులో బెల్జియంను చిత్తుగా ఓడించింది. సమష్టిగా రాణించిన భారత అమ్మాయిలు జట్టుకు 3-2తో విక్టరీని అందించారు. బెల్జియం డిఫెండర్లను బోల్లా కొట్టిస్తూ.. ఫస్ట్ హాఫ్లోనే ఫార్వర్డ్ ప్లేయర్ గీతా యాదవ్గోల్ చేసింది. 11వ నిమిషంలో గీతా చేసిన గోల్తో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. 25వ నిమిషంలో బెల్జియం క్రీడాకిరిణి మరీగోయెన్స్ గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఆతరువాత లూయిస్ వాన్ హెకే చేసిన గోల్తో బెల్జియం ఆధిక్యం సాధించింది.
21తో పైచేయి సాధించింది. అయినా భారత అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగారు. ఈ క్రమంలో 40వ నిమిషంలో సోనమ్ మెరుపు గోల్ చేసి 22 స్కోర్తో సమం చేసింది. బెల్జియంకు మరో అవకాశం ఇవ్వలేదు. 45వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ (Penalty corner) ను గోల్ పోస్ట్లోకి తలలించిన డిఫెండర్ లథన్ట్లుంగీ భారత్కు 31తో ఆధిక్యాన్ని అందించింది. అనంతరం ప్రత్యర్థి అమ్మాయిలు గోల్ కోసం చేసినా భారత్ ఢిఫెండర్లు అడ్డుకోవడంతో భారత్ తొలి పోరులోనే భారీ విజయం సాధించింది. కాగా, భారత్ అమ్మాయిలు రేపు(జూన్ 10న) మరోసారి బెల్జియంతో తలపడనున్నారు.