Thursday, May 22, 2025

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. టెక్సాస్ లోని ఆస్టిన్ ప్రాంతంలో ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడు దాడి చేసి హతమార్చాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భారతీయ సంతతికి చెందిన అక్షయ్ గుప్తా (30) హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. మే 11న టెక్సాస్‌లో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా, ఆయన హత్య జరిగింది. బస్సులో వెనుక కూర్చొన్న గుప్తాపై మరో భారతీయుడు దీపక్ కండేల్ దాడి చేసి హతమార్చాడు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్ని గుప్తాను ఆస్పత్రికి తీసుకెళ్లగా , అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఎలాంటి సంఘర్షణ చోటు చేసుకోకపోయినా, కండేల్ దాడి చేసినట్టు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బయటపడింది. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, అక్షయ్ గుప్తా తన మామలా కనిపించడం వల్లనే తాను అతనిని కత్తితో పొడిచానని నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. అక్షయ్ పెన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News