- Advertisement -
లండన్ నివాసి జన్మతః గుజరాతీ అర్జున్ పటోలియా విషాదాంతం కలిచివేసే రీతిలో ఉంది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన పటోలియా తన భార్య అస్థికలను గుజరాత్లోని నర్మద జలాల్లో కలిపేందుకు వచ్చారు. భార్య తన అంతిమ క్షణాలలో భర్తతో తన అస్థికలను గుజరాతీల ఆరాధ్య నర్మద నదిలో కలపాలని కోరింది. పిల్లలను లండన్లో వదిలిపెట్టి పటోలియా గుజరాత్కు వచ్చాడు. భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మం ప్రకారం అస్థికల నిమజ్జనం చేసి లండన్కు వెళ్లుతున్న విమానం ప్రమాదానికి గురైంది. ఆయన కూడా ఇందులో ఉన్నాడు. ఆయన శరీరం బూడిదైంది.
- Advertisement -