లండన్: ఇంగ్లండ్ పర్యటకు వెళ్లిన భారత క్రికెట్ జట్టును (Team India) గాయాలు (Injury) టెన్షన్ పెడుతున్నాయి. ఈ నెల 24 నుంచి ఇంగ్లండ్తో భారత అండర్-19 జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడాలి. ఈ సిరీస్కి ముందు ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. బిసిసిఐ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లోని ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఆదిత్య రాణా, ఖిలన్ పటేల్కు గాయాలయ్యాయి.
ఆదిత్య వెన్ను భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్కి గురి కాగా.. ఖిలన్ కుడి కాలికి గాయమైంది (Injury). దీంతో వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లట్లేదని బిసిసిఐ ప్రకటించింది. వీరి స్థానంలో దీపేశ్, నమన్ పుష్పక్లను ఇంగ్లండ్ పంపించనున్నారు. ఇంగ్లండ్లో భారత అండర్-19 జట్టు (Team India) జూన్ 24న 50 ఓవర్ వార్మప్ మ్యాచ్, జూన్ 27 నుంచి జూలై 7 వరకూ ఐదు వన్డేలు, జూలై 12-15 వరకూ తొలి మల్టీ డే మ్యాచ్, జూలై 20-23 వరకూ రెండో మల్టీ డే మ్యాచ్ ఆడనుంది.