- Advertisement -
హైదరాబాద్: జూన్ 16వ తేదీన తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎల్లుండి(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు సప్లిమెంరటీ ఫలితాలను వెల్లడించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. గత నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 4.2 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారితోపాటు మార్కులు మరిన్ని పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా పరీక్షలు రాశారు.
- Advertisement -