తెలంగాణ ఇంటర్మీడియట్, ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మై 22 నుంచి మే 29 తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. తాజా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 67.4 శాతం, సెకండ్ ఇయర్ లో 50.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సబ్జెక్టు వాయిస్ విద్యార్థుల మార్కుల వివరాలు బోర్డు అధికారులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన ఫలితాల్లో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే జూన్ 17 నుంచి జూన్ 23 వరకు https://tgbie.cgg.gov.in లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రీవెరిఫికేషన్తోపాటు స్కాన్ కాఫీ పొందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలి.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..రీకౌంటింగ్కు చివరి తేదీ ఇదే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -