- Advertisement -
మల్లేశం, 8 ఏఎం మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ని ప్రకటించారు. మే 16న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
- Advertisement -