Thursday, June 5, 2025

IPL Final 2025: ఆర్సీబికి షాకిచ్చిన చాహల్.. రెండో వికెట్ డౌన్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2025 ఫైనల్ సమరంలో పంజాబ్ కింగ్స్ తో తలపడుతున్న బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి రెండో ఓవర్ లోనే షాక్ తగిలింది.  దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన ఫిల్ సాల్ట్ (16) ఔటయ్యాడు. కైల్ జేమీసన్ వేసిన ఓవర్ లో భారీ షాట్ కొట్టగా గాల్లో పైకి లేచిన బంతిని శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులో వచ్చిన మయాంక్ అగర్వాల్(24).. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అగర్వాల్ ను చాహల్ బోల్తా కొట్టించాడు. తొలి ఓవర్ లోనే మయాంక్ ను పెవిలియన్ కు పంపించి పంజాబ్ కు బ్రేకిచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 61 రన్స్ చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (17), రజత్ పాటిదర్(2)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News