- Advertisement -
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపిఎల్ 2025 ఫైనల్ సమరంలో బెంగళూరు నిర్ధేశించిన 191 పరగులు లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1)ను షెఫర్ట్ పెవిలియన్ పంపించాడు. దీంతో 80 పరుగులకు పంజాబ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లలో 81 పరుగగులు చేసింది. క్రీజులో ఇంగ్లిస్(24), వధేర(1)లు ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(43), మయాంక్ అగర్వాల్(24), లివింగస్టోన్(25), జితేశ్ శర్మ(24)లు రాణించగా.. చివర్లో షఫర్డ్(17) బ్యాట్ ఝుళిపించాడు.
- Advertisement -