Wednesday, June 18, 2025

6వ రోజు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు.. 609 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సైనిక వివాదం బుధవారం మరింత తీవ్రమైంది. వరుసగా ఆరో రోజు ఇరుపక్షాలు ఒకదానిపై ఒకటి భీకర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. ఇరుదేశాల వైమానిక దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 609 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది పౌరులు గాయపడ్డారు. ఇరాన్‌లో 585 మంది మరణించగా.. ఇజ్రాయెల్‌లో 24 మంది వైమానిక దాడుల కారణంగా చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇజ్రాయెల్‌పై ఫట్టా-1 హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తో దాడుల్లో ఈ క్షిపణిని ఇరాన్ మొదటిసారి ఉపయోగించినట్లు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి. ఈరోజు తెల్లవారుజాము నుండి.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణులతో ఇరాన్ విరచుకుపడింది. దాదాపు 400 క్షిపణులను ప్రయోగించిందని.. వాటిని ఇజ్రాయెల్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అనుమానిత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలో వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

కాగా, ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదించింది. దాంతోపాటు G7 శిఖరాగ్ర సమావేశం నుండి ట్రంప్ ఆకస్మికత్తుగా తిరిగి అమెరికా రావడంతో అమెరికా ఇజ్రాయెల్‌తో చేతులు కలుపుతుందనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారని.. అమెరికన్ యుద్ధ విమానాలను రంగంలోకి దింపనున్నట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు.  ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాకున్నాడో తమకు తెలుసని.. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఖమేనీ.. యుద్ధం ప్రారంభమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయోల్ పై దాడులకు దిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News