ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వైమానిక దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణులతో భీకర దాడులకు దిగడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో అన్ని ఎయిర్ పోర్టులు మూసివేశారు. మరోవైపు, జీ-7 సమావేశం నుంచి డోనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఇరాన్ లో ఏక్షణమైనా ఏదైనా జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ గగనతలంపై ఆంక్షలు విధించింది. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను వదిలి స్వదేశానికి రావాలని భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో టెహ్రాన్ నుంచి అప్ఘనిస్తాన్ మీదుగా భారతీయులు.. ఇండియాకు చేరుకుంటున్నారు. కాగా, ఈ దాడుల్లో ఇరుదేశాల్లో దాదాపు 300కు పైగా మంది మృతి చెందగా.. వందల మంది గాయాలపాలయ్యారు.
వెంటనే టెహ్రాన్ నుంచి వచ్చేయండి.. భారతీయులకు హెచ్చరిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -