ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్, ఇరాన్
ఒప్పందం కుదిరినట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ప్రకటన తర్వాత కొద్ది సేపటికే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడి
కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటన
ఇరు దేశాలూ ఒప్పందాన్ని ఉల్లంఘించాయంటూ మండి పడిన ట్రంప్
విమానాలను తక్షణం వెనక్కి పిలవాలంటూ ఇజ్రాయెల్కు వార్నింగ్
ట్రంప్ హెచ్చరికతో దిగివచ్చిన నెతన్యాహు
కాల్పుల విరమణ అమలవుతోందంటూ మరోసారి ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య గత 12రోజులుగా సాగుతున్న యుద్ధానికి మంగళవారం ఎట్టకేలకు తెర పడింది. అయితే అనేక నాటకీయ పరిణామాలు ట్విస్టుల తర్వాత ఈ కాల్పుల విరమణ అమలులోకి రావడం విశేషం. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పం దం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇరుదేశాల మధ్య ఘర్షణలు కొనసాగడంతో కాల్పుల విరమణ అమలవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యా యి. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన తర్వాత కూడా ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, దాడులకు సిద్ధపడడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. రెండు దేశాలు కూడా ఒప్పందాన్ని ఉల్లఘించాయన్న ఆయన ము ఖ్యంగా ఇజ్రాయెల్ తీరుపై మండిపడ్డా రు. ఇరాన్ గగన తలంలోకి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెళ్లి బాంబుల వ ర్షం కురిపించడాన్ని తప్పుబట్టిన ఆయ న తక్షణం ఆ విమానాలను వెనక్కి రప్పించాల్సిందిగా ఆదేశించారు. చివరికి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అధికారికంగా ప్రకటించడంతో కాల్పుల విరమణ అమలుపై నమ్మకం కుదిరింది.
అయితే కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పూర్తి అప్రమత్తంగానే ఉంటామని ఇరుదేశాలు ప్రకటించడం గమనార్హం.
సోమవారం రాత్రి ఇరాన్ ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడులు చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించడం విశేషం.
ట్రంప్ ప్రకటన వెలువడ్డానికి కొద్ది నిమిషాల ముందు వరకు కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. దీనికి ప్రతిగా మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ను లక్షంగా చేసుకుని టెహ్రాన్ క్షిపణలు ప్రయోగించింది. దీంతో పలు చోట్లు సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకువస్తున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. బీర్షెబా పట్టణంపై ఇరాన్ 20 క్షిపణులను ప్రయోగించిందని, ఈ దాడిలో మూడు నివాస భవనాలు ధ్వం సమయ్యాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, కనీ సం 20 మంది గాయపడ్డారని సహాయక బృందాలు వెల్లడించాయి. అనేక కార్లు మం టల్లో మంటల్లో కాలిపోయాయి. ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దీనికి గట్టిగా బదులిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది కూడా. టెహ్రాన్ను లక్షంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది కూడా.
ఇజ్రాయెల్కు ట్రంప్ వార్నింగ్
కాల్పుల విరమణ కుదిరినట్లుగా తాను ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య దాడులు కొనసాగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడం ద్వారా ఒ ప్పందాన్ని ఉల్లంఘించాయంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ది హేగ్ లో జరగబోయే నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్ల్లాడిన ట్రం ప్ కాల్పుల విరమణ తర్వాత రెండు దేశా లు మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. ‘ఆ తర్వాత కొన్ని గంటల కే ట్రంప్ మరో ప్రకటన చేవారు. అన్ని వి మానాలు వెనక్కి తిరిగి వచ్చేస్తాయన్నారు.