Friday, June 20, 2025

నా కుటుంబం త్యాగం చేసిందన్న ప్రధాని… చురకలంటిస్తున్న ప్రజలు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇరాన్‌తో యుద్ధం కారణంగా తమ దేశ ప్రజలంతా త్యాగాలు చేయాల్సి వస్తోందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. కొందరు తమ ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోయి విచారంలో ఉన్నారని, వారి త్యాగాలను అభినందిస్తున్నామన్నారు. భద్రతా కారణాలతో కుమారుడు అవ్నర్ వివాహం రెండో సార్లు వాయిదా వేసుకున్నానని, ఇది తన కుటుంబం త్యాగం చేసిందని పేర్కొన్నారు.

పెళ్లి వాయిదా అనే త్యాగామా? అని ఇజ్రాయిల్ ప్రజలు మండిపడుతున్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధం గత ఎనిమిది రోజులుగా కొనసాగుతోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులు ఎక్కుపెట్టింది. ఇరాన్‌ను చావు దెబ్బకొడుతామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News