Saturday, June 14, 2025

ఇజ్రాయిల్ మెరుపు దాడులు.. ఇరాన్ మిలిటరీ చీఫ్ మృతి

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయిల్ మెరుపులు దాడులతో విరుచుకుపడింది. శుక్రవారం ఇరాన్ లోని నటాంజ్ యురేనియం కేంద్రంతో సహా కీలకమైన ఇరానియన్ అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇజ్రాయిల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనిక అధికారి, సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరితోపాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధిపతి మేజర్ జనరల్ హోస్సేన్ సలామి, ఇతర సీనియర్ అధికారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్ సైన్యానికి భారీ దెబ్బ తగిలింది. కాగా, ఈ దాడులపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ.. ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని.. కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News