Sunday, June 15, 2025

ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య భీకర దాడులు.. 60 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్ క్షిపణి దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్ లో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఇరాన్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా శనివారం దాదాపు 200కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో ఇరాన్.. ఇజ్రాయిల్ పై ఎటాక్ చేసింది. ఈ దాడులకు అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన ఇజ్రాయిల్ సైన్యం.. 150కి పైగా ఇరాన్ క్షిపణులను ధ్వంసం చేశాయి. ఇరాన్ దాడుల్లో ముగ్గురు ఇజ్రాయిల్ పౌరులు మృతి చెందగా.. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో తీవ్రంగా స్పందించిన ఇజ్రాయిల్.. నివాస ప్రాంతాలపై దాడులు ఆపకపోతే టెహ్రాన్ మండిపోతుందంటూ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. అయినా ఇరాన్ దాడులు ఆపకపోవడంతో.. ఇజ్రాయిల్ సైన్యం టెహ్రాన్ పై విరుచుకుపడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండు దేశాలు పరస్పరం క్షిపణులతో భీకర దాడులకు దిగాయి.

ఇరాన్‌కు ప్రధాన ఆర్థిక జీవనాధారమైన ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ కు ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. టెహ్రాన్‌లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి పడటంతో 29 మంది పిల్లలతో సహా దాదాపు 60 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. అంతేకాదు, మరో ఇద్దరు ఇరానీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News