ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు 200 యుద్ధ
విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ అణ్వాయుధాలు,
సైనిక స్థావరాలే లక్షం ఇరాన్ ఆర్మీ చీఫ్ మొహ్మద్
బఘేరీ, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేనీ సలామీ సహా
పలువురు సైనిక ఉన్నతాధికారుల హతం ఆరుగురు
అణుశాస్త్రవేత్తలు మరణించినట్లు ఇరాన్ అంగీకారం
నటంజాలోని ఇరాన్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసం
100 డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడి తిప్పికొట్టిన టెల్అవీవ్
ఇరాన్ అణు గుండెలపై దాడి చేశామని నెతన్యాహు ప్రకటన
ఇజ్రాయెల్కు కఠిన శిక్ష తప్పదని ఖిమేని హెచ్చరిక
టెల్అవీవ్/టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో మళ్లీ రగులుతోంది. ఇరాన్ అణ్వాయుధ స్థావరా లు, న్యూక్లియర్ శుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా శుక్రవారంనాడు ఇజ్రాయెల్ దాడులకు తెగపడింది. అణుశక్తి కేంద్రాలపై ముందుగా దాడు లు చేసింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందనే భయాందోళనలు హెచ్చాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ -ఇన్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. మ రికొందరు ఉన్నత సైనికాధికారులు, శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు సమాచారం. వారిలో ఖాత మ్ అల్ అన్బియా,హెడ్కార్టర్స్ చీఫ్ అలీ రషీద్, ఇరాన్ సుప్రీ లీడర్ సలహాదారు అలీ షంఖానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటన చేశారు. వీరంతా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్కు చెందిన రహస్య నేలమాళిగలో సమావేశం అవుతుండగా ఇజ్రాయెల్ దాడిచేసిన ట్లు సమాచారం.
మరోవైపు ఇజ్రాయె ల్ దాడుల్లో ఇరాన్లోనే అతిపెద్ద న తాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం పూర్తిగా దెబ్బతింది. ఇటీవల కాలం లో ఇరాన్కు వాటిల్లిన అతి పెద్ద నష్టం ఇది. ఇరా న్ కూడా ఇజ్రాయెల్ పై కొన్నిగంటలలోనే 100కు పైగా డ్రోన్ లతో ప్రతీకారదాడులు జరిపింది. అయితే వాటిని తిప్పికొడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1980వ దశకంలో ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ పై మరో దేశం చేసిన అతిపెద్ద దాడి ఇదే. ఇజ్రాయెల్ ప్రధానంగా అణుశక్తి కేంద్రాలు, క్షిపణుల స్థావరాలను దెబ్బతీసినట్లు ఆ సైన్యం ప్రకటించింది. ఇరాన్ పారా మిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ నాయకుడు జనరల్ హుస్సేన్ సలామీ చనిపోయినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్,- ఇరాన్ పరస్పర దాడులలో త మకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి పాత్ర కూడా లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం తమకు పూర్తిగా తెలుసునని ఒప్పుకున్నారు.
ఇరాన్లోని భారతీయులకు అడ్వైజరీ
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ద్వారా అడ్వైజరీ విడుదల చేసింది. “ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, బారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తం గా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్ర మాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించి, తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి” అని అడ్వైజరీలో పేర్కొంది.