Wednesday, August 20, 2025

40 అంతస్తులంత జంబో రాకెట్ నిర్మిస్తున్నాం : ఇస్రో ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ముందడుగు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 40 అంతస్తుల భవనమంత భారీ రాకెట్ నిర్మించే పనిలో నిమగ్నమైనట్టు ఆ సంస్థ చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం , ఎన్1 రాకెట్ ప్రయోగం , అమెరికాకు చెందిన 6500 కిలోల బరువైన కమ్యునికేషన్ శాటిలైట్‌ను కక్ష లోకి చేర్చడం వంటి ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు. “ మీకు తెలుసా … అబ్దుల్ కలామ్ జీ తయారు చేసిన తొలిరాకెట్ 17 టన్నుల లిఫ్ట్‌ఆఫ్ బరువుతో 35 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూ కక్షకు చేర్చింది.

కానీ నేడు 75,000 కిలోల బరువైన పేలోడ్‌ను దిగువ భూ కక్షకు చేర్చడంపై పనిచేస్తున్నాం. అందుకు అవసరమైన రాకెట్ 40 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది ” అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు కక్షలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందన్నారు. ఇస్రో ప్రస్తుతం టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ శాటిలైట్ (టీడీఎస్) , నౌకాదళం కోసం సిద్ధం చేసిన జీశాట్ 7 ఆర్ ప్రయోగించనుంది. ఇది ఇప్పటికే కక్షలో ఉన్న జీశాట్7 (రుక్మిణి) స్థానాన్ని భర్తీ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News