కడప: ఆంద్రప్రదేశ్ లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నములో, ఇసుజు మోటార్స్ ఇండియా ఈరోజు కడపలో ఒక కొత్త అధీకృత సర్వీస్ కేంద్రము ఎస్. కే. మోటార్స్ ను ప్రారంభించింది. భాగ్యనగర్ కాలనీలో వ్యూహాత్మకంగా ప్రారంభించబడిన ఈ సర్వీస్ కేంద్రానికి కడప జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు.
ఏఎస్సి సదుపాయాన్ని ఇసుజు మోటార్స్ ఇండియా నుండి ఉన్నత స్థాయి కంపెనీ అధికారులు మరియు ఇతర ప్రముఖులు ప్రారంభించారు. ఎస్. కే. మోటార్స్ రెండు దశాబ్దాలుగా ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక విశ్వసనీయమైన ఆటోమొబైల్ సర్వీస్ భాగస్వామిగా నిలిచింది మరియు ఇది ఇసుజు వాహనాల కొరకు అంకితభావము కలిగిన మరియు ప్రత్యేకమైన సేవలను అందించడముపై దృష్టి కేంద్రాకరిస్తుంది. టోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు, “మాకు ఆంద్రప్రదేశ్ ఒక కీలక మార్కెట్ గా, కొనసాగుతోంది మరియు నిరంతరాయ సేవా సహకారాన్ని నిర్ధారించుటకు మేము ఎస్. కే. మోటార్స్ ను మా కొత్త అధీకృత సర్వీస్ భాగస్వామిగా నియమించాము. ఇసుజు వద్ద మేము దేశవ్యాప్తంగా మా సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించుటకు కట్టుబడి ఉన్నాము. వారు తమ యాజమాన్య ప్రయాణములో అభివృద్ధి చెందుతున్న ఇసుజు కమ్యూనిటితో అర్థవంతమైన సంబంధాన్ని పెంచుకొనుటలో వారికి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము.”
షేక్ కరీముల్లా, డీలర్ ప్రిన్సిపల్ ఎస్ కే మోటార్స్ ఇలా అన్నారు, “ఇసుజు మోటార్స్ ఇండియాతో భాగస్వామ్యం కలిసినందుకు మేమెంతో గర్విస్తున్నాము మరియు ఈ ప్రాంతములోని వినియోగదారులకు ఇసుజు పద్ధతిలో సర్వీస్ అనుభవాన్ని అందించుటకు కట్టుబడి ఉన్నాము. మాకు గుర్తింపు తెచ్చిన రెండు దశాబ్దాల మా నైపుణ్యము నాణ్యమైన సేవ మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఈ కొత్త అధీకృత సర్వీస్ కేంద్రము మా ప్రయాణములో ఒక ప్రత్యేక మైలురాయి మరియు ఈ ప్రాంతములో సేవలు అందించుటకు మేము ఉత్సాహంగా ఉన్నాము.”
ఈ సదుపాయములో తగిన మౌలికసదుపాయాలు ఉన్నాయి మరియు సమర్థవంతమైన, నాణ్యమైన సేవను అందించడాన్ని నిర్ధారించే సుశిక్షితులైన వృత్తి నిపుణులు ఉన్నారు. విశ్వసనీయత మరియు వినియోగదారుడి సంతృప్తిపై దృష్టితో, ఈ కేంద్రము ఈ ప్రాంతములో ఇసుజు యొక్క పెరుగుతున్న ఉనికిని పునరుద్ఘాటిస్తూ, స్థిరమైన, ఆధారపడగలిగిన సేవను అందించుటకు కట్టుబడి ఉంది.