- Advertisement -
మాంచెస్టర్: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు భారత జట్టు 118 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలో కదం తొక్కారు. ఈ మ్యాచ్లో శుభ్ మన్ గిల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కెఎల్ రాహుల్ 90 పరుగులు పర్వాలేదనిపించాడు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(58), రవీంద్ర జడేజా(53) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిష్ వోక్స్ రెండు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో ఒక వికెట్ తీశారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 358
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 669
- Advertisement -