Monday, June 2, 2025

బాబు సంపద సృష్టించారా?.. పథకాలు అమలవుతున్నాయా?: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో జరుగుతున్న పరిణామాలపై నాణేనికి రెండవ వైపున చూపించే ప్రయత్నం చేస్తున్నామని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని, ఎన్నికలకు ముందు చంద్రబాబు డైలాగ్ లు విన్నప్పుడు, చూసినప్పుడు తన చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది అన్నారని, సంపద సృష్టిస్తానని చెప్పారని, ఎక్కడ సృష్టించారని ప్రశ్నించారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారని, కానీ ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని అడిగారు. జగన్ హాయంలో రాష్ట్రం శ్రీలంక అయ్యిందన్న తప్పుడు మాటలు కూడా విన్నామని, చంద్రబాబు పన్నెండు నెలల కాలంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని జగన్ చురకలంటించారు. వైసిపి హయంలో కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని గొప్పగా నడిపించామని, ఓ సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా చేసి చూపించామన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచామని, కొనుగోలు శక్తి పెరిగిందని, ఈ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగురగొట్టి మోసం చేశారని జగన్ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News