- Advertisement -
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు మధ్య జరుగుతున్న దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధం వల్ల జగిత్యాలకు (Jagtial Person) చెందిన రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం రవీందర్ ఇజ్రాయెల్కు వెళ్లాడు. అయితే యుద్ధం జరుగుతుండగా.. బాంబు శబ్ధం వల్ల రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రవీందర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రవీందర్ మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
- Advertisement -