Monday, June 30, 2025

బిసిలను ఊరించి మోసం చేసిన బిజెపి: జాజుల శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అధ్యక్ష పదవి బిసిలకిస్తామని ఊరడించి, ఊరించి చివరికి బిజెపి బిసిలను మోసం చేసిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బిసిల జపం చేస్తుంటే బిజెపి మాత్రం అగ్రకులాల జపం చేస్తోందని దుయ్యబట్టారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల మాట్లాడుతూ 60 శాతం ఉన్న బిసిలను కాదని, ఒక శాతం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే , బిజెపి వచ్చే ఎన్నికలు ఘోర పరాజయం చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిసిని సిఎం చేస్తానన్న బిజెపి, చివరికి ఫ్లోర్ లీడర్ గా కూడా అగ్రకులాలకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్ష పదవి బిసికి ఇవ్వని పార్టీ, రేపు బిసిని సిఎం చేస్తానంటే బిజెపిని బిసిలు ఎప్పటికీ నమ్మరని ఆయనన్నారు.

42 శాతం బిసి బిల్లుకు ఆమోదం తెలపకుండా, బిసిలకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వకుండా బిజెపి పచ్చి బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. బిజెపి ఇప్పుడు తెలంగాణలో బ్రాహ్మణ, బనియ, జనతా పార్టీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిలో అగ్రకుల హిందువులకు ఒక న్యాయం, బిసి హిందువులకు ఇంకొక న్యాయమా అని ప్రశ్నించారు. బిసిలపై బిజెపి పార్టీ వివక్షత కనబరుస్తోందని, బిజెపిలో ఎంతోమంది బసిలు పార్టీ అధ్యక్ష పదవికి అర్హులునప్పటికీ, వారికి బిసి కులమే అనహార్వతగా మారిందని ఆవేవన వ్యక్తం చేశారు. బిసిలను మోసం చేసిన బిజెపిని బిసి ద్రోహుల పార్టీగా భావిస్తున్నామని, బిజెపిలో ఉన్న బిసి నేతలు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా ్న వెంటనే బిజెపికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిల బలమేంటో త్వరలోనే బిజెపికి రుచి చూపించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News