లీడ్స్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ ధీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలింగ్లో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి రోజే మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను ఓ అరుదైన రికార్డును సాధించాడు.
సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్ర చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్లో బెన్ డక్కెట్ వికెట్తో ఈ రికార్డును సాధించాడు. దీంతో బుమ్రా (Jasprit Bumrah) ఇప్పటివరకూ సేనా దేశాల్లో 148 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మూడో రోజు భోజన విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసి.. 144 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో జేమీ స్మిత్, హారీ బ్రూక్ ఉన్నారు.