లీడ్స్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చెలరేగిపోయాడు. 24.4 ఓవర్లు వేసిన బుమ్రా 83 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొడట్టాడు. మిగితా బౌలర్ల అంతగా రాణించలేదు. దీంతో జట్టులో బుమ్రా ఉండటం ఎంతో అవసరమో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సిరీస్కి ముందు బుమ్ర కొన్ని మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని వార్తలు వినిపించాయి. దీంతో బుమ్రా ఫ్యాన్స్ నిరాశ చెందారు. బుమ్రా లేని పక్షంలో భారత బౌలింగ్ యూనిట్ బలహీన పడుతుందని వారి అభిప్రాయపడ్డారు.
అయితే తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన తర్వాత బుమ్రా (Jasprit Bumrah) మీడియాతో మాట్లాడుతూ ఈ సిరీస్లో మూడు కంటే ఎక్కవ మ్యాచుల్లో ఆడే విధంగా సూచన చేశాడు. ‘‘భారత్ కంటే ఇక్కడ చల్లటి వాతావరణం ఉంది.. నేను ఉల్లాసంగా ఉన్నాను కాబట్టి మంచి విషయాలు జరుగుతాయని ఆశిస్తున్నా’’ అని బుమ్రా అన్నాడు. దీంతో అతను ఈ సిరీస్లో ఎక్కువ మ్యాచులు ఆడుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.