Sunday, June 15, 2025

నన్ను చూసి జెసి ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు: పెద్దారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాడిపత్రికి తనని పోలీసులు వెళ్లనివ్వడంలేదని తాడిపత్రి మాజీ ఎంఎల్‌ఎ కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పాటించడంలేదని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో ఖాకీలు చేస్తున్నారని చురకలంటించారు. శనివారం ఉదయం తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని యల్లనూరు మండల తిమ్మంపల్లి గ్రామ శివారులో వాహనాలను పెట్టి పోలీసులు అడ్డుకోవడంతో పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తాడిపత్రి పర్యటన పలుమార్లు వాయిదా వేసుకున్నానని, తాడిపత్రిలో సొంతిళ్లు ఉందని, తన ఇంటికి తాను వెళ్తానంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

తాడిపత్రిలో టిడిపి గుండాలు కత్తులు, కటారాలతో సంచరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాడిపత్రిలో ఐపిఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్న ప్రయోజనం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో గంజాయి, అక్రమ దందాలు కొనసాగుతున్నాయని, తాను తాడిపత్రికి వెళ్తే అక్రమ దందాలు సాగవని జెసి ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండడంతో తనకు రక్షణ కల్పించలేమని ఎస్‌పి జగదీష్ తెలిపారన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే ఆయనకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News