- Advertisement -
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జె.ఇ.ఎం) అగ్ర కమాండర్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఎసార్ పాకిస్తాన్లోని పంజాబ్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయాన్ని పలు మీడియా నివేదికలు వెల్లడించాయి. ఎసార్ మరణానికి సంబంధించిన వీడియో విదేశీ మీడియాలో కూడా వెలుగులోకి వచ్చింది. భారత్ లో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులకు అతను ప్రధాన సూత్రధారి. ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ నిన్న మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని భక్కర్ జిల్లాలోని కల్లూర్ కోట్లోని అష్రఫ్వాలాకు చెందిన అతను అతను గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. కానీ మరణానికి అసలు కారణం ఇంకా నిర్ధారించలేదు.
- Advertisement -