Saturday, July 26, 2025

కెటిఆర్ బర్త్‌డే..విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన జోగినపల్లి సంతోష్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పుట్టినరోజు వేడుకలు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా సామాజిక సేవకు వేదికగా మారాయి. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గిఫ్ట్ ఏ స్త్మ్రల్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉదారంగా సహాయం అందించారు. బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సౌకర్యార్థం 100 బెంచీలను అందించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువులో తొలి రెండు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు 20 సైకిళ్లను బహుకరించారు. ‘గిఫ్ట్ ఏ స్త్మ్రల్’ అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు ఇది నిరంతర సేవా కార్యక్రమం. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ముఖ్యంగా విద్యార్థులకు సహాయం అందించాలనే ఈ కార్యక్రమ లక్ష్యం.

విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సైకిళ్ల పంపిణీ విద్యార్థులు పాఠశాలకు సులభంగా చేరుకోవడానికి సహాయపడు ంది. తద్వారా వారి హాజరు శాతం పెరుగుతుంది. దీంతో నాణ్యమైన విద్యకు అందించవచ్చు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి కెటిఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, సనత్ నగర్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్, క్రైస్తవ కమ్యూనిటీ ఫాస్టర్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారు విద్యార్థులతో ముచ్చటించి వారిని ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాజకీయ నాయకులు, ప్రముఖులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించడాన్ని సూచిస్తాయని వెల్లడించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News