- Advertisement -
కేటీ దొడ్డి: అనుమానంతో ప్రియుడు ప్రియురాలిని హత్య చేసిన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతపాలెం గ్రామంలో రంగస్వామి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని రోజుల ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియురాలిని చంపాలని ప్రియుడు నిర్ణయం తీసుకున్నాడు.
ప్రియురాలుపై అనుమానం పెరగడంతో ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉరేశాడు. సదరు మహిళ ఉరేసుకొని చనిపోయిందన్నట్టుగా గ్రామస్థులను నమ్మించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా రంగస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -