కేంద్ర ప్రభుత్వం దేశంలో బిహార్, ఉత్తర్ప్రదేశ్కు నిధులు కేటాయించినట్లు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఇక్కడ ఆ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎంపీ లు, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యే లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంలో 22 మంది సిఎంలు పాలించిన సమయంలో ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.75 వేల కోట్లు ఉంటే.. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో అప్పు ఏకంగా రూ.8ల క్షల కోట్లకు చేరిందని మండిపడ్డారు.గత పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఈభివృద్ధి కంటే అధికంగా విధ్వంసం జరిగిందని ఆరోపించారు.
గత ప్రభుత్వానిది కేవలం గోబెల్ ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యానించారు.రాష్ట్రానికి నిధులు తీసుకురావడంతో బిజెపి ఉన్న ఎనిమిది మంది ఎంపిలు, మరో ఎనిమిది మంది ఎంఎల్ఎలు ఏంచేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు గురిచేస్తున్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు లను వెనువెంటనే పరిష్కరించాలని.. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ఇక్కడ పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.
ఫోన్ ట్యాపింగ్కు గురైన వారిలో తన పేరు కూడా ఉండొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో ఎంఎల్ఎసి దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నాయకులు శ్యామ్ నాయక్, దిగంబర్ రావు పాటిల్, గోక గణేష్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, గిమ్మ సంతోష్ రావు, కొండ గంగాధర్, మునిగెల నర్సింగ్, కలాల శ్రీనివాస్, రామ్ కుమార్, బొల్లారపు బాబన్న, రఫీక్, శ్రవణ్ నాయక్ , రవి తదితరులు పాల్గొన్నారు.