Wednesday, April 30, 2025

కాకినాడ జీజీహెచ్‌లో డాక్టర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాకినాడలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న డాక్టర్ శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. రష్యాలో ఎంబీబీఎస్ చదివిన శ్రీకిరణ్ ప్రస్తుతం జీజీహెచ్ మార్చురీ విభాగంలో పనిచేస్తున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం శ్రీకిరణ్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News