Sunday, June 15, 2025

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేయాలి: కూనంనేని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాధనాన్ని ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దు అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరానికి అన్నీ తానే అన్న మాజీ సిఎం కెసిఆర్ ఇప్పుడు సంబంధం లేదంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మించాక ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని, ఎల్లంపల్లి ద్వారానే పంటలకు నీళ్లు అందుతున్నాయని తెలియజేశారు. కేంద్రప్రభుత్వం (Central Government) మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రం భయపడుతోందని, మృతదేహాన్ని అప్పగించకపోవడం దారుణమని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News