అమరావతి: ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో ప్రియుడితో భర్తను చంపించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాళ్లూరు వెంకటాంపల్లిలో సురేశ్ బాబు(43), అనిత అనే దంపతులు నివసిస్తున్నారు. సురేశ్ బాబు కళ్యాణదుర్గంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య ఓ హోటల్లో కూలీగా పని చేస్తోంది. గొరిదిండ్లకు చెందిన బాబావలీతో అనితకు పరిచయం ఏర్పడడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో భర్త ఉండగా ప్రియుడిని అక్రమ సంబంధం కొనసాగించడం కష్టమని భావించింది.
భర్తను హత్య చేయాలని ప్రియుడితో పది రోజుల నుంచి ప్లాన్ వేసింది. 11వ రోజుల భర్త ఫుల్గా మద్యం తాగి అక్కంపల్లి నుంచి వెళ్తుండగా ప్రియుడికి ఫోన్ చేసి హత్య చేయాలని తెలిపింది. గ్రామ శివారులో సురేష్ రాకకోసం బాబావలీ ఎదురుచూస్తున్నాడు. బాబావలీ దగ్గరకు రాగానే బీరు సీసాతో తలపై మోదాడు. అనంతరం స్క్రూ డ్రైవర్ తీసుకొని బాబావలీపై కడుపు, చాతీలో పొడిచి అనంతరం రాయి అతడి తలపై వేశాడు. చనిపోయాడని నిర్దారించుకున్న తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏమీ తెలియదని నిందితుడు అక్కడికి చేరుకొని పోలీసులకు మృతి వివరాలు చెప్పాడు. పోలీసులు జాగిలాలు అక్కడికి చేరుకొని బాబావలీ ఇంటికి దగ్గర ఆగిపోయాయి. నిందితుడు ఆటోలో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. భార్య, ప్రియుడ్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.