- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: కూతురుకు ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపే క్రమంలో తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్బాసుపురం తండాలో బానోతు మోహన్ లాల్, కల్యాణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు సింధు ఉంది. టేకులపల్లి మండలం కొత్తతండాకు చెంది యువకుడితో తన కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించింది. ఆదివారం సాయంత్రం కూతురు అప్పగింతల కార్యక్రమం జరుగుతుండగా తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -