చెన్నై: ఎనిమిదో తరగతి బాలురులు 11వ తరగతి విద్యార్థినిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చారు. విద్యార్థిని స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కాంచిపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డిఎంకె పార్టీ నేత కుమారుడు, హీరో విజయ్ పార్టీ నేత కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు కలిసి 11వ తరగతి చదివే విద్యార్థినితో స్నేహంగా ఉండేవారు. 22 ఏళ్ల యువకుడు, ఎనిమిదో తరగతి విద్యార్థులతో కలిసి సదరు యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింక్స్ ఆమెకు ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై ఇద్దరు ఎనిమిదో తరగతి విద్యార్థులు అత్యాచారం చేశారు. సదరు విద్యార్థిని జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు బాలురులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.