Wednesday, June 18, 2025

కందుకూరులో తండ్రిని చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. పులుమామిడి గ్రామంలో ఆస్తి కోసం కన్న తండ్రిని కుమారుడు చంపాడు.  పులుమామిడి గ్రామంలో జంగయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. జంగయ్యకు శేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. జంగయ్య కుమారుడు శేఖర్ గత కొన్ని రోజుల నుంచి ఉన్న ఆర ఎకరం భూమి అమ్ముతానని పలుమార్లు తండ్రితో గొడవకు దిగాడు. గత రాత్రి పొలం అమ్ముతానని తండ్రికి కుమారుడు చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో కుమారుడు రాయి తీసుకొని తండ్రి తలపై కొట్టాడు. తండ్రి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News