Wednesday, June 25, 2025

‘కన్నప్ప’ పురాణం కాదు.. మన చరిత్ర

- Advertisement -
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం.మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. “విష్ణు కన్నప్ప కథ గురించి చెప్పిన తరువాత చాలా పరిశోధన చేశాను. మోహన్ బాబు కూడా మాట్లాడిన తర్వాత నన్ను ఈ చిత్రానికి దర్శకుడిగా ఫైనల్ చేశారు. ‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా సులభంగా మారిపోయింది. అక్షయ్, మోహన్‌లాల్, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు.

‘కన్నప్ప’ మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశ చెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా స్వేచ్ఛ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు. కన్నప్ప అనేది పురాణం కాదు.. ఇది మన చరిత్ర. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవరికీ సరిగ్గా తెలియదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర” అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News