మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప‘. ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో శివుడి పరమ భక్తుడు తిన్నడుగా విష్ణు నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. “తిన్నడు నివసించే గూడెంలో ఉన్న శివ లింగాన్ని కొందరు స్వాధీనం చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో వారిని తిన్నడు ఎలా ఎదుర్కొన్నాడు.. మొదట శివుడు అంటే నచ్చని తిన్నడు.. శివుడికి పరమ భక్తుడు ఎలా అయ్యాడు?” అనే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను రూపొందించారు.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడిగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పరమ శివుడిగా, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పర్వతీ దేవీగా నటించారు. ఇక, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, మంచు మోషన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.