Friday, June 6, 2025

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారథిగా షెఫాలీ షా

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన, త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్ తమ సరికొత్త ప్రచారమైన ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ని విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి షెఫాలీ షాను తమ మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా పరిచయం చేసింది. ఇది 10 మందికి పైగా విలక్షణమైన ప్రచారకర్తలతో చేయనున్న కంపెనీ ప్రయాణంలో ఒక సాహసోపేతమైన, కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్, తమ సొంత మార్గదర్శకాల తో విజయాన్ని పునర్నిర్వచించిన ప్రముఖ నటులను ఒకచోట చేర్చడానికి సిద్ధంగా ఉంది. ప్రతి వారం ఒక కొత్త ప్రచారకర్త పరిచయం చేయబడనున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన సొంత వ్యక్తిత్వంతో ఒక అజేయ శక్తిగా వెలుగొందుతున్నారు. ఈ ప్రచారం రాబోయే కొన్ని నెలల పాటు బహుళ వేదికలపై అందుబాటులో ఉండనుంది.

‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ మొదటి ప్రచార చిత్రంలో షెఫాలీ షా కనిపించారు, ఆమె ఆకట్టుకునే తీరు శక్తివంతమైన కథ చెప్పడం ద్వారా ఒడిసిపట్టబడినది, ఇది మహిళలు తమ బలాన్ని నిస్సందేహంగా స్వీకరించడానికి మరియు వ్యక్తీకరించడానికి ప్రేరేపిస్తుంది. బంగారం, విలువైన రత్నాలు, కట్ మరియు అన్‌కట్ వజ్రాలతో రూపొందించబడిన క్లాసిక్ త్యానీ నెక్లెస్‌లో ఆమె చూడగానే ఆకట్టుకుంటుంది. ప్రతి స్త్రీ యొక్క లయ, కథ మరియు స్ఫూర్తితో ప్రతిధ్వనించే చక్కటి ఆభరణాల అత్యుత్తమ వ్యక్తీకరణగా ఇది నిలుస్తుంది.ఈ ప్రచారం వ్యక్తిత్వాన్ని అరుదైన విలాస రూపంగా వేడుక జరుపుకుంటుంది, దర్పంతో తమ ప్రత్యేక శక్తిని కనుగొని ధరించే మహిళలను ఇది వేడుక చేస్తుంది.

త్యానీ జ్యువెలరీ వ్యవస్థాపకుడు కరణ్ జోహార్ ఈ ప్రచారంపై తన సంతోషాన్ని పంచుకుంటూ :

“ఈ కొత్త అధ్యాయం గురించి మేము పూర్తి సంతోషంగా ఉన్నాము. ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ మా బ్రాండ్ సిద్దాంతంలో అత్యంత కీలకంగా ఉంది. ఏకరూపత లేదా హోదా ద్వారా కాకుండా, వ్యక్తిత్వాన్ని వేడుక చేసుకోవడం ద్వారా విలాసాన్ని ఇది పునర్నిర్వచించనుంది. శక్తి, ప్రామాణికత మరియు ఆవిష్కరణలను ఈ ప్రచారం ముందుకు తీసుకువెళ్తోంది. ఈ అంశాల ప్రాతిపదికనే త్యానీ నిర్మించబడినది. త్యానీ కుటుంబం లోకి షెఫాలీ ని ఆహ్వానిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము ” అని అన్నారు.

రియల్ ఉమెన్, రియల్ స్టోరీస్, రియల్ జ్యువెలరీ అనే ఆలోచనకు జీవం పోస్తూ, ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ ఒక ప్రచారం కంటే ఎక్కువగా ఒక సాంస్కృతిక ఉద్యమంగా నిలుస్తుంది. ప్రతి ఆభరణం వ్యక్తిగత రక్షరేకు గా మారుతుంది, స్వాభావిక అందాన్ని వేడుక జరుపుకోవడానికి మెరుపును దాటి కదులుతుంది. ఇది పనితనం, ఉద్దేశ్యం, ప్రామాణికతను అత్యున్నతంగా ప్రదర్శిస్తోంది.

త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్ ప్రస్తుతం ఏడు నగరాల్లో – ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, లక్నో మరియు చండీగఢ్‌లో ఉంది. ఈ బ్రాండ్ జూన్ 8న అహ్మదాబాద్‌లో తన మొదటి స్టోర్‌ను కూడా ప్రారంభించనుంది. వినియోగదారులు tyaani.com లో ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News